Site icon OkTelugu

ఇక కులం పేరు రాస్తే కఠిన చర్యలు : ఉత్తర్వులు జారీ

పాఠశాలల్లో విద్యార్థుల అటెండెన్స్‌ రిజిస్ట్రర్‌లో ఇక నుంచి కులం పేరు రాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు విద్యార్థుల రిజిస్ట్రర్‌లో కులం, మతం పేరు రాయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. పలు స్కూళ్లలో ఈ వివరాలు రాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇకపై ఆ వివరాలు రాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కులం, మతం పేరు రాయడం వల్ల విద్యార్థుల్లో అసమానతలు పెరిగి చదువుపై ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Exit mobile version