తిరుమలలో నిహారిక దంపతుల సందడి

ఇటీవల వివాహం చేసుకున్న టాలీవుడ్ నటి, మెగా కుటుంబం ఆడబిడ్డ నిహారిక దంపతులు తిరుమలలో సందడి చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిన్న అన్నవరం సత్యానారాయణ ఆలయానికి వెళ్లిన వారు ఆ తరువాత తిరుమలకు చేరుకున్నారు. ఈనెల 9న నిహారికతో చైతన్య వివాహం రాజస్థాన్ లోని జైపూర్ లో అంగరంగ వైభవంగా జరిగిన […]

Written By: Suresh, Updated On : December 14, 2020 10:44 am
Follow us on

ఇటీవల వివాహం చేసుకున్న టాలీవుడ్ నటి, మెగా కుటుంబం ఆడబిడ్డ నిహారిక దంపతులు తిరుమలలో సందడి చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిన్న అన్నవరం సత్యానారాయణ ఆలయానికి వెళ్లిన వారు ఆ తరువాత తిరుమలకు చేరుకున్నారు. ఈనెల 9న నిహారికతో చైతన్య వివాహం రాజస్థాన్ లోని జైపూర్ లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహా వేడుకకు చిరంజీవి కుటుంబంతో పాటు, అల్లు కుటుంబ సభ్యులు సందడి చేశారు. కాగా చైతన్య మాజీ ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు.