
అన్లైన్ కాల్మనీ వ్యవహారాలపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఇదిలా ఉంటే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఆత్మహత్యకు పాల్పడ్డ బాధిత కుటుంబాలకు సీఎం పరిహారం ప్రకటించారు. గుంటూరు జిల్లా కొర్రపాడులో ఆత్మహత్య చేసుకున్న బాలిక కుటుంబానికి రూ.10లక్షల సహాయం.. ప్రకాశం జిల్లాలో దివ్యాంగురాలి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. సహాయం అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.