elephant
ఏనుగు దాడి చేసిన ఘటనలో బాలిక మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మల్లమూరు గ్రామానికి చెందిన సోనియా అనే బాలిక తల్లిదండ్రులతో కలిసి బయటకు వచ్చింది. తమిళనాడు సరిహద్దు హోసర్ పరిధిలోని కృష్ణగిరి అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగు బాలికపై దాడి చేసింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనను కళ్లారా చూసిన తల్లి స్పృహ కోల్పోయింది. సమాచారాన్ని తెలుసుకన్న డీఎఫ్వో రవిశంకర్ సంఘటన స్థలానికి చేరికుని పరిశీలించారు.