Journalist Controversy: ఆయన సాంప్రదాయని.. శుద్ధ పూసని టైపు. పైగా తనంత నిజాయితీ కలిగిన జర్నలిస్టు లేడని చెప్పుకుంటాడు. ఇంటర్వ్యూలు చేస్తాడు. అందులో లేకి ప్రశ్నలు అడుగుతాడు. అంతేకాదు, గతంలో ప్రైమ్ టైం లో వార్తలు చదివేవాడు. ఆ తర్వాత అతగాడి వ్యవహారం తెలిసి మేనేజ్మెంట్ కొద్ది రోజులు పక్కన పెట్టింది. కేవలం ఇంటర్వ్యూలకు మాత్రమే పరిమితం కావాలని స్పష్టం చేసింది. దీంతో అప్పటినుంచి అతడు కేవలం ఇంటర్వ్యూలు మాత్రమే చేస్తాడు. పైగా ప్రశ్నిస్తే శత్రువు అవుతాయేమో.. అయినా పర్వాలేదు ప్రశ్నిస్తూనే ఉంటా అంటూ గొప్ప గొప్ప పతిత్తు కబుర్లు చెబుతుంటాడు.
ఇప్పుడు ఈ సుప్రసిద్ధ జర్నలిస్టు కు ఐటీ నోటీసులు వచ్చాయి. ఏకంగా వందల కోట్ల వెనకేసుకున్నాడట. ఒక్కొక్క ఇంటర్వ్యూకు 15 నుంచి 20 లక్షల వరకు వసూలు చేస్తున్నారట. పైగా ఈ విషయం మేనేజ్మెంట్ కి తెలిసి అంతర్గత విచారణ కూడా మొదలుపెట్టిందట. ఇటీవల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో అతడేకంగా 11 కోట్లు పెట్టి అత్యంత విలాసవంతమైన ప్లాట్ కొనుగోలు చేశాడు. అక్కడితో ఆగిపోలేదు మోకీలా ప్రాంతంలో ఎనిమిది కోట్లతో విల్లా కొనుగోలు చేశాడు. మియాపూర్ ప్రాంతంలో త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్ కొనుకున్నాడు. ఇటీవల ఢిల్లీలో ఉన్న తన కుమార్తె వద్దకు వెళ్లి రావడానికి ఏకంగా స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఆధారాలు ఐటి శాఖకు తెలియడంతో అతడికి నోటీసులు జారీ అయ్యాయి.
ఇక్కడితోనే ఆ జర్నలిస్ట్ సంపాదన వ్యవహారం ఆగిపోలేదు. బెంగళూరులో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టాడు. ఇటీవల ఆ కంపెనీ మీద ఐటి అధికారులు దాడులు చేశాడు. అమరావతిలో అతడు కొనుగోలు చేసిన భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి. కృష్ణయ్యపాలెంలో 18 ఎకరాల భూమి కొనుగోలు చేస్తే.. ఇటీవల సిఆర్డిఏ నుంచి తనకు ప్లాట్ రావాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాలు తెలియడంతో ఇన్కమ్ టాక్స్ అధికారులు అందరికీ నోటీసులు ఇచ్చారు. అంత కాదు హైదరాబాద్ రోడ్ నెంబర్ 36 లో నడుస్తున్న ఓ పబ్ లో ఇతడికి వాటా ఉంది. విశాఖపట్నంలో కూడా ఒక పబ్ ఉంది. గతంలో ఓ ప్రభుత్వం ఈయనకు భారీగా డబ్బు ఇచ్చింది. ఆ డబ్బులు మొత్తం క్యాష్ రూపంలో తీసుకున్నాడు. హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్ లు ఒక పార్టీకి అనుకూలంగా పనిచేసే విధంగా ఒప్పందం కుదిరించాడు. అయితే ఆ ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడంతో.. ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ నిర్వాహకులు ఇతడిని ప్రశ్నించారు.. తాను ఇప్పుడు ఆ డబ్బులు ఇప్పించలేనంటూ చేతులు కూడా ఎత్తేశాడు.
తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది రాజకీయ నాయకులను ఇటీవల ఇంటర్వ్యూలకు పిలిపించాడు ఇతడు. వారి దగ్గర నుంచి భారీగానే లక్షల్లో వసూలు చేశాడు. అయితే మార్కెటింగ్ సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ విషయం తెలియడంతో మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లారు.. అంతేకాదు తన బినామీతో వసూలు చేసిన మొత్తం కూడా మేనేజ్మెంట్ కు తెలియడంతో.. మేనేజ్మెంట్ ఇతడి మీద విచారణ మొదలుపెట్టింది. అటు ఏపీలో.. ఇటు తెలంగాణలో అనుకూలమైన ప్రభుత్వాలు లేకపోవడంతో.. ఈ సుద్దపూస జర్నలిస్ట్ పరిస్థితి సంకట స్థితిలో పడింది. చూడాలి మరి ఈసారి పోస్ట్ ఉంటుందా.. ఊడుతుందా..
