Hyderabad : నిర్లక్ష్యానికి ప్రాణం బలి : కారు డోరు.. ఆ పసిపాపను చిదిమేసింది

ఈ ఘటనలో చిన్నారి సహా దంపతులు కిందపడిపోగా.. 2 ఏళ్ల పాప అక్కడిక్కడే మృతి చెందింది. సయ్యద్, శశిరేఖ దంపతులకు గాయాలయ్యాయి. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెలవిసేలా రోధించిన తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది.

  • Written By: NARESH ENNAM
  • Published On:
Hyderabad : నిర్లక్ష్యానికి ప్రాణం బలి : కారు డోరు.. ఆ పసిపాపను చిదిమేసింది

Hyderabad : ఓ చిన్న నిర్లక్ష్యం ఓ పసిపాప ప్రాణాలు తీసింది. ఓ కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. రోడ్డుపై నిర్లక్ష్యంగా వెళితే ప్రవర్తిస్తే ఎంతటి దారుణాలు జరుగుతాయో ఈ ఘటన కళ్లకు కట్టింది.

హైదరాబాద్‌ లో ఎల్బీ నగర్‌ లో దారుణం జరిగింది. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి ఓ 2 ఏళ్ల పాప ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రోడ్డు పక్కన కారు ఆపిన డ్రైవర్ సడెన్‌గా డోర్ తీయటంతో బైక్ పై వెనుకాల వస్తున్న ఓ కుటుంబం కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో వారి 2 ఏళ్ల పాప అక్కడికక్కడే మృతి చెందింది.

సయ్యద్-శశిరేఖ దంపతులకు 2 ఏళ్ల ధనలక్ష్మి పాప ఉంది. ఈ ముగ్గురు బైక్ పై వస్తున్నారు. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి సమీపంలోకి రాగానే.. ఓ వ్యక్తి రోడ్డు పక్కన కారు ఆపాడు. ఆపై వెనుక నుంచి ఎవరు వస్తున్నారో చూసుకోకుండా సడెన్‌గా కారు డోర్ తీశాడు. అంతే.. వెనుక నుంచి బైక్ వస్తున్న సయ్యద్ బైక్‌కు కారు డోరు తగిలింది.

ఈ ఘటనలో చిన్నారి సహా దంపతులు కిందపడిపోగా.. 2 ఏళ్ల పాప అక్కడిక్కడే మృతి చెందింది. సయ్యద్, శశిరేఖ దంపతులకు గాయాలయ్యాయి. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెలవిసేలా రోధించిన తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది.

ఘటన తర్వాత ఆ కారు డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు