OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • 2021 రౌండ్ అప్
  • English
You are here: Home / రాజకీయాలు / ఆంధ్రప్రదేశ్ / రాజ్యాంగంలో లేని రాజధానిపై ఇంత రాద్ధాంతమా..!

రాజ్యాంగంలో లేని రాజధానిపై ఇంత రాద్ధాంతమా..!

Published by Raghava On Saturday, 8 February 2020, 11:46

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాలలో చివరిరోజు ప్రసంగం అనేక ప్రశ్నలకు తెరలేపింది. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై శాసనమండలిలో జరిగిన పరిణామాలు దుర దృష్టకరమన్నారు. తప్పు అని తెలిసినా విచక్షణాధికారాలతో నిబంధనలు అతిక్రమించి ఇష్టారాజ్యంగా వ్యవహరించే ఇలాంటి వ్యవస్థ మనకు అవసరమా అనేది ప్రజలు, మేధావులు ఆలోచించాలన్నారు. శాసనసభలో గురువారం శాసనమండలి, విచక్షణాధికారాలు, చట్ట ఉల్లంఘన నిబంధనల అతిక్రమణ ప్రజా ప్రయోజనాలపై ముఖ్యమంత్రి సుదీర్ఘ ప్రసంగం చేశారు.

భారత రాజ్యాంగంలో రాజధాని అనే పదమేలేదని స్పష్టం చేశారు. గత 8 నెలలుగా అనేక ప్రజోపయోగమైన చట్టాలను, సవరణ బిల్లులను ప్రవేశపెట్టామని తెలిపారు. ఆర్టీసీ విలీనం మొదలుకుని ఆంగ్ల మాధ్యమం వరకు దేశంలోనే మరెక్కడాలేని సంస్కరణలు తీసుకు వచ్చామన్నారు. సమాజంలో అణగారిన వర్గాలపై మనసుపెట్టి పనిచేస్తున్నామని, తాము పాలకులం కాదు సేవకులమనే భావనతోనే ఉన్నామన్నారు. చట్టాలను కాపాడుకునేందుకు చెక్స్ అండ్ బ్యాలెనె్సస్ అవసరమని, అయితే శాసన మండలిలో జరిగిన పరిణామాలు మాత్రం దురదృష్టకరమన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేస్తూ చట్టసభలను అపహాస్యం చేశారని విమర్శించారు. చైర్మన్ నిష్పాక్షికంగా సభను నిర్వహించే పరిస్థితి లేదన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు తనకు సంబంధంలేని మండలి గ్యాలరీలోకి రావటం, ఆయన కనుసన్నల్లోనే చైర్మన్ నిబంధనలను ఉల్లంఘించి అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపటం దారుణమన్నారు. ఏదైనా బిల్లు మండలికి వస్తే చర్చించాలి, ఆమోదించాలి లేదా తిరస్కరించాలని, సభ్యుల అభిప్రాయాలను సూచిస్తూ సవరణలు పంపాల్సి ఉందన్నారు. ఇవేమీ లెక్కచేయకుండా విచక్షణాధికారం పేరుతో ప్రజలకు న్యాయం చేయకుండా ఉండేందుకు శాసనమండలిని వాడుకున్నారని ధ్వజమెత్తారు. దీన్ని మనం ఆమోదిస్తే ప్రజాస్వామ్యానికి విలువ ఉండదన్నారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లులకు సంబంధించి రూల్స్ సక్రమంగా ఉన్నాయని, దీనిపై చర్చించ వచ్చని అన్ని పార్టీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ చివరిక్షణంలో ఒత్తిళ్లకు తలొగ్గి తన తప్పును తాను అంగీకరిస్తూనే రాజ్యాంగ విరుద్ధంగా చైర్మన్ వ్యవహరించారని ఆరోపించారు. తప్పును ఒప్పుకుని తెలిసి కూడా విచక్షణాధికారంతో చేస్తామనటం సమంజసం కాదన్నారు. ఏ బిల్లుకైనా సవరణలు విధానపరంగా అది ప్రవేశపెట్టిన 12 గంటల లోపే ఇవ్వాలన్నారు. సెలక్ట్ కమిటీకి ఇవ్వాలనే ఆలోచన ముందుగా చేయాలన్నారు. శాసనమండలిలో ప్రభుత్వపరంగా వచ్చే బిల్లులకు తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రైవేట్ బిల్లులను తరువాత మాత్రమే ప్రవేశపెట్టాలనే నిబంధన ఉందన్నారు. సెలక్ట్ కమిటీ వేయాలనే ప్రతిపాదన రూల్ పరంగా లేదని చెప్పారు. ఈ విషయంలో నిబంధనలు లేవని తెలిసినా తన విచక్షణాధికారంతో తప్పు చేస్తున్నట్లు చైర్మన్ స్వయంగా ప్రకటించారని వివరించారు. ప్రజా స్వామ్యంలో ఇది ఎంత వరకు సమ్మతమో ప్రజలే తేల్చాలన్నారు. శాసనమండలి చట్ట ప్రకారం నడుస్తోందా? పార్టీ, వ్యక్తుల కనుసన్నల్లో నిర్వహిస్తున్నారా అనే విషయాలు ఈ సందర్భంగా దీన్ని బట్టి ఆలోచించాలన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ ఇష్టా ఇష్టాలను తుంగలో తొక్కారన్నారు. ప్రాంతీయ అసమానతలు చోటు చేసుకోకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధికి, పాలనా వికేంద్రీకరణకు నిర్దేశించిన బిల్లులను చట్టం కాకుండా నిరోధించే సభగా మండలి మారిందన్నారు.

హత్య చేయటం నేరమని తెలిసి కూడా చేస్తాననటం నేరం కాదా అని ప్రశ్నించారు. అందరి అభిప్రాయంతో దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలనే భావనతో ఉన్నట్లు చెప్పారు. 2019 ఏప్రిల్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 సీట్లు గెలుచుకుని శాసనసభలో 86 శాతం మెజారిటీ సాధించామని, ప్రజామోదంతో అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు.

శాసనసమండళ్లు దేశంలోని 22 రాష్ట్రాల్లో ఎక్కడాలేవని, కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయన్నారు. పేద రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మండలి నిర్వహణకు రోజుకు కోటి రూపాయల ఖర్చవుతుందని, ఏడాదిలో 60 రోజులు అంటే రూ. 60 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. మేధావులకు నేరుగా అవకాశం కల్పించి ప్రభుత్వానికి సూచనలిచ్చేందుకు మాత్రమే ఈ సభలు ఏర్పాటయ్యాయని, అయితే శాసన సభలోనే ఉన్నత చదువులు చదివిన వైద్యులు, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, పోస్టుగ్రాడ్యుయేట్లు ఉన్నారన్నారు. చివరకు యాక్టర్లు, జర్నలిస్టులు కూడా సభల్లో ప్రవేశిస్తున్నారని అలాంటప్పుడు మండలి అవసరమా అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేసే ఆలోచన లేకపోగా ఎలా ఆపాలి, ఎలా జాప్యం చేయాలనే దురుద్దేశంతో హాని కలుగజేసే ఇలాంటి సభలు ఎంత వరకు అవసరమో ఆలోచించాలన్నారు. ప్రజాభిప్రాయం, చట్టసభల నిబంధనలకు వ్యతిరేకంగా, చట్టం, రూల్స్‌తో సంబంధం లేకుండా పనిచేస్తున్న మండలిని కొనసాగించటం అవివేకమవుతుందని స్పష్టం చేశారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదని చెప్తూ సీటు గవర్నెన్స్ ఉంటుందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, చట్టాలు చేసే అధికారాన్ని ప్రజలు తమకు అప్పగించారని స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం కల్పించారన్నారు. పాలనా వికేంద్రీకరణ ఇందులో భాగమన్నారు.

తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఊటీ నుంచి పాలించారని గుర్తు చేశారు. ప్రతిపక్షనేత చంద్రబాబు హుదూద్ తుపాను సమయంలో పది రోజులు విశాఖలోనే ఉన్నారని అక్కడి నుంచే అన్ని వ్యవహారాలు నడిపారన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడి నుంచే పాలన నిర్వహించే అధికారం ఉందన్నారు. ఇందుకు ఏ చట్టం, బిల్లు అవసరం లేదని చెప్తూ ఓ తీర్మానం చేస్తే సరిపోతుందని వివరించారు. అసెంబ్లీ సమావేశాలు ఎక్కడైనా నిర్వహించ వచ్చని, ఆర్టికల్ 174 ప్రకారం ఎక్కడైనా చట్టాలు చేసుకునే వీలుందన్నారు. ప్రజలకు మంచిచేసే పనులను అడుగడుగునా అడ్డుకుంటూ రాజకీయ దురుద్దేశాలకు వేదికగా మారి రాజకీయ అజెండాతో నడుస్తున్న ఇలాంటి సభలకు ఇక ముగింపు పలకక పోతే నష్టపోతామని, దీనిపై ఆలోచన చేయాలని ప్రజలు, ప్రజాప్రతినిధులను కోరారు.

లైఫ్ స్టైల్

India vs Australia: ఆస్ట్రేలియాతో సిరీస్‌ : భారత్‌ ముందున్న అతిపెద్ద సవాల్‌ ఇదే!

IND vs AUS 1st Test Playing XI: ఆస్ట్రేలియాతో టీమిండియా ప్లేయింగ్ బెస్ట్ 11 ఇదే

India Vs Australia: భారత్ Vs ఆస్ట్రేలియా: ఈ రెండు జట్ల మధ్య ఎన్ని రికార్డులున్నాయో తెలుసా..?

India vs Australia Test Series 2023: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టాప్ 5 గొప్ప టెస్ట్ యుద్ధాలివీ

Wake Up: ఉదయం నిద్ర లేవగానే అరచేతులను చూసుకుంటే ఎంత మంచిదో తెలుసా?

Brahma Muhurtham: బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? ఎప్పుడు నిద్రలేవాలి? ప్రయోజనాలేంటి?

Weight Loss Tips: ఇలా సులువుగా మీ బరువును తగ్గించుకోండి

Success: జీవితంలో ఎదగాలంటే ఇవి అస్సలు చేయవద్దు

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

Jamuna- NTR: ఎన్టీఆర్ ని కాలితో తన్నిన జమున… అప్పట్లో అదో పెద్ద వివాదం

Balakrishna- Chiranjeevi: చిరంజీవి సినిమాకి పోటీగా రాకపోతే బాలయ్య ని ఎవ్వరు పట్టించుకోరా..? ప్రూఫ్స్ ఇదే

S. Varalakshmi- Senior NTR: ఆ స్టార్ హీరోయిన్ ని కోడలా అని ఆప్యాయంగా పిలుచుకున్న ఎన్టీఆర్… కారణం తెలుసా!

Kamal Haasan- Balakrishna: అక్కడ కమల్ హాసన్..ఇక్కడ బాలయ్య బాబు..అభిమానులకు పూనకాలు రప్పిస్తున్న వార్త

Unstoppable With NBK- NTR And Kalyan Ram: బాలయ్య షో కి జూ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్.. కలవనున్న నందమూరి ఫ్యామిలీ

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

Nara Lokesh: బ్లడ్ బ్రీడ్ వారసత్వం కదా… లోకేష్ నుంచి అలాంటి మాటలే వస్తాయి

Nayanthara: హీరోయిన్ చేస్తా పక్కలోకి రమ్మన్నాడు… క్యాస్టింగ్ కౌచ్ పై నయనతార షాకింగ్ ఆరోపణలు

Writer Padmabhushan Collection: ‘రైటర్ పద్మభూషణ్’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..టాలీవుడ్ కి మరో భారీ బ్లాక్ బస్టర్

Chicken: మాంసాహారులకు బంపర్ ఆఫర్.. కిలో చికెన్ @ 99కే..

Fake News: ఇక ఏది పడితే అది రాయడం కుదరదు.. సోషల్ మీడియాకు, మీడియాకు ఇదే కేంద్రం హెచ్చరిక

AP Government Employees: ఏపీలో జీతాలు.. జీవితకాలం లేటు

మరిన్ని చదవండి ...

గాసిప్

Dil Raju vs Allu Aravind : మోసం చేయాలనుకున్న దిల్ రాజుకి కనుసైగతోనే వణుకుపుట్టేలా చేసిన అల్లు అరవింద్

Parusharam : ఇంతటి అత్యాశ అవసరమా డైరెక్టర్ మహాశయా!

K Vishwanath : విశ్వనాథ్, చంద్రమోహన్, బాలసుబ్రహ్మణ్యం వరుసకు సోదరులే.. కానీ ట్విస్ట్ ఇదే

Prostitution in Tollywood : నిర్మాతల వద్దకు వర్ధమాన హీరోయిన్లను పంపి.. వ్యభిచారం నిర్వహిస్తూ పట్టబడ్డ ప్రముఖ దర్శకుడి అసిస్టెంట్

Pawan Kalyan : వెన్నుపోటు పొడిచిన స్నేహితుడిని మరోసారి దగ్గరకి తీసుకున్న పవన్ కళ్యాణ్

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

Heartfulness Celebration : కెనడా టొరంటోలో అంబరాన్నంటిన హార్ట్ ఫుల్ నెస్ వార్షిక వేడుకలు

Telugu Association of Jacksonville Area USA : జైహో అనిపించిన ‘తాజా’ సంక్రాంతి సంబరాలు

TANA : తానా 23వ మహాసభల నిర్వహణ, సమన్వయ కమిటీల సమావేశం

Nara Lokesh Birth Day : యూకేలోని లండన్, కోవెంట్రీ నగరాల్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

TANA : తానా ఆధ్వర్యంలో బాపట్ల నాగులపాలెంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2022 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap