గత కొంతకాలంగా దేశంలో పౌరసత్వం బిల్లుకు సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి. ఇటీవలే ఈ బిల్లుకు చట్టబద్దత లభించింది. బిల్లు ఆమోదం పొందటంతో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి అమలు చేస్తున్నారు. ఈ చట్టాన్ని మొదటగా కర్ణాటకలో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో దీనిని అమలు చేసి ఆ తరువాత మిగతా రాష్ట్రాల్లో అమలు చేయడానికి సిద్ధం అవుతున్నారు.
Read More: కేటీఆర్ కి అద్భుతమైన బహుమానం సిద్ధంచేసిన కేసీఆర్?
అయితే, చాలా రాష్ట్రాలు దీనికి ఒప్పుకోవడం లేదు. పౌరసత్వ చట్టం వలన మైనారిటీలకు ఇండియాలో ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. అసలు ఈ చట్టానికి, మైనారిటీలకు సంబంధం లేదని ఎంత చెప్తున్నా సరే పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షాలు మొత్తం కలిసి సిఏఏ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రధాని మోడీకి ఓ గిఫ్ట్ ను అందించింది. అదేమంటే భారత రాజ్యాంగం. అమెజాన్ లో భారత రాజ్యాంగ ప్రతిని కొనుగోలు చేసింది. ఈ ప్రతిని త్వరలోనే మోడీకి అందుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం దేశంలో ప్రతి ఒక్కరు సమానమే అనే విషయం తెలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మోడీకి చెప్తున్నది. మరి కాంగ్రెస్ ఇచ్చిన గిఫ్ట్ కు మోడీ ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో చూడాలి.
Read More:
సారూ.. అప్పుడు గెలిచారు.. హామీలు మరిచారు..ఇప్పుడైనా జర దెఖో..