గత కొంతకాలంగా.. కరోనా వైరస్ భయంతో ప్రపంచ దేశాలు గడగడ లాడుతున్న విషయం తెలిసిందే.. అయితే థాయిలాండ్ ప్రభుత్వం కరోనా ని నిర్ములించడానికి చికిత్సని కనుగొన్నామని ప్రకటించింది. దీంతో అన్ని దేశాలు షాక్ అవుతున్నాయి.
ఈ మధ్య థాయిలాండ్ లో ఒక ముసలావిడ కరోనా వైరస్ సోకడంతో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ ముసలావిడ శరీరం నుంచి కరోనా వైరస్ ను పూర్తిగా నిర్మూలించేశామని ప్రకటించింది థాయిలాండ్. చైనా తరువాత అత్యధికంగా కరోనా బాధితులున్న దేశం థాయిలాండ్. ఫ్లూ, హెచ్ఐవీ చికిత్సల్లో అందించే మందులను వివిధ మోతాదులలో కరోనా వైరస్ ను కంట్రోల్ చేయడానికి వినియోగించారట. అంతే ఈ చికిత్స సక్సస్ అయింది.