OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • 2021 రౌండ్ అప్
  • English
You are here: Home / రాజకీయాలు / జాతీయం / కెసిఆర్ కి ఒవైసీ గండం?

కెసిఆర్ కి ఒవైసీ గండం?

Published by Raghava On Saturday, 8 February 2020, 11:36

కెసిఆర్ తెలంగాణలో తిరుగులేని నాయకుడుగా రోజు రోజుకీ ఓ వైపు ఎదుగుతుంటే రెండోవైపు ఆయనకు ఒవైసీ గండం గ్రహణంలాగా పట్టుకున్నట్లు అనిపిస్తుంది. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఆసుపాసుల్ని పూర్తిగా ఆపోసన పట్టిన కెసిఆర్ కి తెలంగాణ అభివృద్ధికి ఎక్కడ ఏ చర్యలు తీసుకోవాలో బాగా తెలుసు. ముఖ్యంగా నీటిపారుదలరంగంలో తనదైన ముద్రవేస్తూ ముందుకు వెళ్తున్నాడు. మొదట్లో తుమ్మడిహట్టి నుంచి కాళేశ్వరం మార్చినందుకు వచ్చిన వివాదం క్రమక్రమంగా తగ్గుముఖంపట్టింది. ఎప్పుడయితే నీటిపారుదల ప్రాజెక్టులకు ఎక్కువ నిధులుకేటాయించి కాళేశ్వరం ప్రాజెక్టును పరుగులు పెట్టించాడో అప్పుడే రైతుల్లో సానుకూల వాతావరణం పెరుగుకుంటూ వచ్చింది. ఇంకో సంవత్సరానికి మొత్తం ప్రాజెక్టు ఫలితం రైతులకు చేరితే తనకు రాజకీయంగా తిరుగువుండదని అందరూ అనుకుంటున్నారు.

నిజంగాకూడా పరిస్థితులు పూర్తి అనుకూలంగా మారుతున్నాయని చెప్పొచ్చు. ఇదే వూపులో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కూడా పూర్తిచేస్తే తనను ప్రజలు నెత్తిన పెట్టుకొని పూజించుకుంటారు. ఒకసారి కాళేశ్వరం పూర్తయితే ఆ ప్రభావం దక్షిణ తెలంగాణ ప్రజలపై కూడా పడుతుందని మరచిపోవద్దు. పాలమూర్-రంగారెడ్డి, దిండి , సీతారామ ప్రాజెక్టులు కూడా పూర్తిచేస్తాడనే విశ్వాసం బలపడుతుంది. ఇవి రాజకీయంగా కెసిఆర్ కి అనుకూల పవనాలు. తనహయాంలో ఇన్ని ప్రాజెక్టులు పూర్తయితే ఒడిశాలో నవీన్ పట్నాయక్ లాగా దీర్ఘకాలం తెలంగాణాలో స్థిరపడే అవకాశం వుంది. ప్రజల్లో నవీన్ పట్నాయక్ పై వున్న సదభిప్రాయం కెసిఆర్ పై లేకపోయినా నీటిపారుదల ప్రాజెక్టులే తనని ఆ స్థాయిలో నిలబెడతాయని భావిస్తున్నారు.

అంతవరకు బాగానే వున్నా కెసిఆర్ అనవసరమైన రిస్కు తీసుకుంటున్నట్లు కనబడుతుంది. మొదట్నుంచీ రాజకీయాల్లో ధీటైన ఎత్తుగడలతో ప్రత్యర్థిని దెబ్బతీయటం కెసిఆర్ కి వెన్నతో పెట్టిన విద్య. దానికోసం అవసరమైతే విలువలను పక్కనపెట్టయినా ఎత్తుగడలు వేయటంలో తనకు మించినవాడు లేడు. దీంట్లో భాగంగానే తెలంగాణాలో ముస్లిం సామాజిక వర్గాన్ని జాగ్రత్తగా దగ్గరకు తీసి వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనటం జరిగింది. అదేసమయంలో కేంద్రంలోని బీజేపీ తోకూడా సఖ్యతగా మెలుగుతూ కేంద్రం దగ్గర పనుల్ని చక్కదిద్దుకుంటూ వస్తున్నాడు. అయితే ఇది ఇటీవల ఇబ్బందిగా మారింది. ఒవైసీ కి బిజెపి కి పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుందని తెలుసు. కేంద్రం లో మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు ముస్లిం సామాజిక వర్గంలో కొంతమేర వ్యతిరేకతను తీసుకొచ్చాయి. అంతకుముందు ముమ్మూరు తలాక్ , ఆర్టికల్ 370 బిల్లులపై కెసిఆర్ మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయటం తన మిత్రుడు ఒవైసీకి, ముస్లిం సామాజిక వర్గానికి కొంత అసంతృప్తిని కలిగించాయి. అయినా మొత్తం మీద రాష్ట్రంలో కెసిఆర్ ముస్లిం అనుకూల విధానాలు తీసుకోవటంతో కొంతవరకు సర్దుకుపోయింది.

కానీ ఇప్పుడు పౌరసత్వ చట్టం, ఎన్ పి ఆర్ , ఎన్ ఆర్ సి లపై ఏదోఒక వైపు మొగ్గాల్సిన పరిస్థితి కెసిఆర్ కి ఏర్పడింది. అందుకనే పౌరసత్వ బిల్లుపై బీజేపీ కి వ్యతిరేకంగా వోటువేయటం జరిగింది. ఇప్పుడు ఒవైసీ దేశవ్యాప్తంగా దీనిపై పెద్ద ప్రచారం చేపట్టటం తో పాటు కెసిఆర్ పై ఒత్తిడి పెంచటం జరిగింది. నిన్న ఒవైసీ ముస్లిం మత పెద్దల్ని తీసుకొని కెసిఆర్ తో మూడు గంటలు సమావేశం వేశాడు. కెసిఆర్ ని పూర్తిగా ఈ ప్రచారంలో భాగంగా మద్దత్తు కావాలని కోరినట్లు తెలుస్తుంది. కెసిఆర్ కూడా సానుకూలంగా ఉన్నట్లు అర్ధమవుతుంది. దీంట్లో భాగంగానే రేపు నిజామాబాదు లో జరిగే బహిరంగ సభకు తెరాస ప్రతినిధులు కూడా హాజరవుతారని తెలుస్తుంది. ఇదే జరిగితే కెసిఆర్ పెద్ద రిస్కు తీసుకున్నట్లే. ఇప్పటివరకు కెసిఆర్ ఒవైసీ పరోక్ష మద్దత్తు మాత్రమే తీసుకున్నాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా తనతో కలిసి ప్రయాణం చేస్తే ఇది బీజేపీ కి ఓ లాటరీ తగిలినట్లే. కెసిఆర్ కి వ్యతిరేకంగా ఏదైనా ఘటన కోసం ఎదురుచూస్తున్న బీజేపీ కి ఓ ఆయుధాన్ని కెసిఆర్ ఇచ్చినట్లే అవుతుంది. ఎందుకంటే ప్రస్తుత సమస్య సమాజం లో మత పరమైన సమీకరణలకు వూతమిస్తుంటే కెసిఆర్ ఓ మతానికి పూర్తి మద్దత్తు ప్రకటించినట్లుగా బీజేపీ ప్రచారం చేసే అవకాశాలు మెండుగా వున్నాయి.

పౌరసత్వ బిల్లుని వ్యతిరేకించటం వేరు , ఒవైసీ తో కలవటం వేరు. ఈరెండింటిలో తేడా వుంది. ఇదే నిజామాబాద్ జిల్లా భైన్సాలో అక్బరుద్దీన్ ఒవైసీ హిందూ మతస్థులకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కేసులు ఎదుర్కుంటున్న సంగతి అందరికీ తెలుసు. ప్రజల్లో ఆ జ్ఞాపకాలు చెరిగిపోకముందే తిరిగి నిజామాబాదు లోనే ఈ బహిరంగ సభ జరగటం మెజారిటీ ప్రజలకు సమ్మతం కాదు. మరి ఈ సమావేశంలో తెరాస ప్రతినిధులు కూడా పాల్గొంటే అది ఆత్మహత్యా సదృశమవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. సమస్య ఏదైనా ఒవైసీ తో కలిసి సభను పంచుకోవటం కెసిఆర్ తీసుకుంటున్న పెద్ద రిస్కుగా భావించాలి. ఇది కెసిఆర్ వ్యూహాత్మక తప్పిదమవుతుందని అనుకుంటున్నారు. పొరపాటున సభలో ఒవైసీ ఏదైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అది దావానలం లాగా మారుతుందని అందరికీ తెలుసు. ఇప్పుడు పూర్తి అనుకూల రాజకీయ వాతావరణంలో వున్న కెసిఆర్ కి ఇంత పెద్ద రిస్కు తీసుకోవాల్సిన అవసరం లేదు. కెసిఆర్ ఎత్తుగడల్లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాడని అందరూ భావిస్తున్న తరుణంలో ఇంత పెద్ద రిస్కు తీసుకుంటాడో లేదో వేచి చూద్దాం.

లైఫ్ స్టైల్

India vs Australia: ఆస్ట్రేలియాతో సిరీస్‌ : భారత్‌ ముందున్న అతిపెద్ద సవాల్‌ ఇదే!

IND vs AUS 1st Test Playing XI: ఆస్ట్రేలియాతో టీమిండియా ప్లేయింగ్ బెస్ట్ 11 ఇదే

India Vs Australia: భారత్ Vs ఆస్ట్రేలియా: ఈ రెండు జట్ల మధ్య ఎన్ని రికార్డులున్నాయో తెలుసా..?

India vs Australia Test Series 2023: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టాప్ 5 గొప్ప టెస్ట్ యుద్ధాలివీ

Wake Up: ఉదయం నిద్ర లేవగానే అరచేతులను చూసుకుంటే ఎంత మంచిదో తెలుసా?

Brahma Muhurtham: బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? ఎప్పుడు నిద్రలేవాలి? ప్రయోజనాలేంటి?

Weight Loss Tips: ఇలా సులువుగా మీ బరువును తగ్గించుకోండి

Success: జీవితంలో ఎదగాలంటే ఇవి అస్సలు చేయవద్దు

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

Jamuna- NTR: ఎన్టీఆర్ ని కాలితో తన్నిన జమున… అప్పట్లో అదో పెద్ద వివాదం

Balakrishna- Chiranjeevi: చిరంజీవి సినిమాకి పోటీగా రాకపోతే బాలయ్య ని ఎవ్వరు పట్టించుకోరా..? ప్రూఫ్స్ ఇదే

S. Varalakshmi- Senior NTR: ఆ స్టార్ హీరోయిన్ ని కోడలా అని ఆప్యాయంగా పిలుచుకున్న ఎన్టీఆర్… కారణం తెలుసా!

Kamal Haasan- Balakrishna: అక్కడ కమల్ హాసన్..ఇక్కడ బాలయ్య బాబు..అభిమానులకు పూనకాలు రప్పిస్తున్న వార్త

Unstoppable With NBK- NTR And Kalyan Ram: బాలయ్య షో కి జూ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్.. కలవనున్న నందమూరి ఫ్యామిలీ

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

Nara Lokesh: బ్లడ్ బ్రీడ్ వారసత్వం కదా… లోకేష్ నుంచి అలాంటి మాటలే వస్తాయి

Nayanthara: హీరోయిన్ చేస్తా పక్కలోకి రమ్మన్నాడు… క్యాస్టింగ్ కౌచ్ పై నయనతార షాకింగ్ ఆరోపణలు

Writer Padmabhushan Collection: ‘రైటర్ పద్మభూషణ్’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..టాలీవుడ్ కి మరో భారీ బ్లాక్ బస్టర్

Chicken: మాంసాహారులకు బంపర్ ఆఫర్.. కిలో చికెన్ @ 99కే..

Fake News: ఇక ఏది పడితే అది రాయడం కుదరదు.. సోషల్ మీడియాకు, మీడియాకు ఇదే కేంద్రం హెచ్చరిక

AP Government Employees: ఏపీలో జీతాలు.. జీవితకాలం లేటు

మరిన్ని చదవండి ...

గాసిప్

Dil Raju vs Allu Aravind : మోసం చేయాలనుకున్న దిల్ రాజుకి కనుసైగతోనే వణుకుపుట్టేలా చేసిన అల్లు అరవింద్

Parusharam : ఇంతటి అత్యాశ అవసరమా డైరెక్టర్ మహాశయా!

K Vishwanath : విశ్వనాథ్, చంద్రమోహన్, బాలసుబ్రహ్మణ్యం వరుసకు సోదరులే.. కానీ ట్విస్ట్ ఇదే

Prostitution in Tollywood : నిర్మాతల వద్దకు వర్ధమాన హీరోయిన్లను పంపి.. వ్యభిచారం నిర్వహిస్తూ పట్టబడ్డ ప్రముఖ దర్శకుడి అసిస్టెంట్

Pawan Kalyan : వెన్నుపోటు పొడిచిన స్నేహితుడిని మరోసారి దగ్గరకి తీసుకున్న పవన్ కళ్యాణ్

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

Heartfulness Celebration : కెనడా టొరంటోలో అంబరాన్నంటిన హార్ట్ ఫుల్ నెస్ వార్షిక వేడుకలు

Telugu Association of Jacksonville Area USA : జైహో అనిపించిన ‘తాజా’ సంక్రాంతి సంబరాలు

TANA : తానా 23వ మహాసభల నిర్వహణ, సమన్వయ కమిటీల సమావేశం

Nara Lokesh Birth Day : యూకేలోని లండన్, కోవెంట్రీ నగరాల్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

TANA : తానా ఆధ్వర్యంలో బాపట్ల నాగులపాలెంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2022 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap